హాజరైన మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం టీవీ మణుగూరు:
హైదరాబాదు లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పినపాక నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ, మణుగూరు మండల, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం మే లక్ష్యంగా,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేయాలి అని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో 25న జరిగే ప్లీనరీ తో పాటు వచ్చే నెల 15 న వరంగల్ లో జరిగే మహాగర్జనకు భారీ స్థాయిలో ప్రజలను,కార్యకర్తలను, తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి.బ్రహ్మయ్య, మణుగూరు మండల, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,ఎంపీపీ విజయకుమారి,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ప్రధాన కార్యదర్శులు రాం రెడ్డి,నవీన్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, సొసైటీ చైర్మన్ లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: