CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అకాల వర్షం.... అపార నష్టం.... పంట నష్టపోయిన ఆహార వాణిజ్య పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి...జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

Share it:


మన్యం టీవీ మంగపేట. శనివారం సాయంత్రం మండలంలోని అకినేపల్లి మల్లారం కత్తిగూడెం గ్రామాల్లో అకాల వర్షం అన్నదాతలను హడలెత్తించింది రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన విస్తారమైన వర్షం కురిసింది దీంతో చేతికి వచ్చిన వరి పంట ముఖ్యంగా గా యం టి యూ 7029 స్వర్ణ రకం వరి వంగడం నేలమట్టమైంది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అంతేకాకుండా చేతికి వచ్చిన వాణిజ్య పంట పత్తి పంట సైతం నేల జారింది అదేవిధంగా గా సుగంధ పంటగా సాగు చేసిన మిర్చి పొలాలను వర్షం నీరు నిలబడి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది ములుగు జిల్లా లోని వెంకటాపురం మండలం సూర వీడు ఎదిర నుండి గోదావరి తీరం వెంట అకస్మాత్తుగా వచ్చిన వర్షం అకినేపల్లి మల్లారం తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి.కొత్తగూడెం వీరాపురం చెగరిశల భీమవరం గ్రామాల్లో కుంభవృష్టి కురిసింది ఇప్పటికే వరి కోత పూర్తి చేసిన పలువురు రైతులు పలువురు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతుండగా పైరుపై ఉన్న వరి పొలం నేలమట్టం కావడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేల పాలయిందనీ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించాలి.... ప్రభుత్వం పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించాలని అదేవిధంగా జాతీయ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని భీమా పరిహారాన్ని రైతాంగానికి మంజూరు చేయాలని పంట నష్టపోయిన క్షేత్రాలను వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టం నివేదికలు రూపొందించాలని జాతియ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబ శివరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సాయంత్రం వర్షం పడిన వెంటనే పలువురు రైతులతో కలిసి పంట నష్టం జరిగినా వరి క్షేత్రాలను సాంబశివరెడ్డి పరిశీలించారు
Share it:

TELANGANA

Post A Comment: