👉 హాజరుకానున్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,సీపీఎం,సిపిఐ, రాష్ట్ర కార్యదర్శులు.చాడ వెంకటరెడ్డి,తమ్మినేని వీరభద్రం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు. మాన్యం టివి:ములకలపల్లి మండలం: పొడు రైతులకు పట్టాలు ఇవ్వాలి అని తెలంగాణా మొత్తం ఈ నెల 5వ తారీకున అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రహదారిపై దిగ్బంధం "సడక్ బంద్" నిర్వహించనున్నది,కావున మండలం లోఉన్న ప్రతి పొడు సాగుదారులు కుటుంబాలు మొత్తం పిల్ల,పాప ల తో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చెయ్యాలని వామపక్షాలు కాంగ్రెస్. టీడీపీ నాయకులు ములకలపల్లి లో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చాయి. ఈ రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం పొడు రైతు కి అన్యాయం చేస్తుందని,హరితహారం కార్యక్రమాన్ని కేవలం పొడు సాగు భూముల ను లాక్కోవడం కోసం చేస్తున్నారని,కేసీఆర్ ఏడు ఏళ్ల పాలనా కాలం లో లక్ష ఎకరాలు భూమి పేదలు నుంచి గుంజు కొన్న దుర్మార్గుడని అన్నారు. ఈనెల5వ తారీకున జరుగుతున్న సడక్ బందు తో కేసీఆర్ కళ్లు తెరవాలని అన్నారు.ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్. ములకలపల్లి సర్పంచ్ టీడీపీ నాయకులు బేబినేని బద్రం. సీపీఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి మండల కార్యదర్శి కల్లూరి కిషోర్,కాంగ్రెస్ నేత పుప్పాల హునుమంత్ రావు,నరాటి రమేష్, తదితరులుపాల్గొన్నారు.
Post A Comment: