జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫర్ మాతృ శిశు సంక్షేమ అధికారి డాక్టర్ సుజాత...
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఆసుపత్రిలోనే కాన్పులు జరిగేలా చూడాలని మాతృ శిశు సంక్షేమ అధికారి డాక్టర్ సుజాత అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగే డెలవరీలు, వాటి రికార్డుల నిర్వహణ, కెసిఆర్ కిట్ల పంపిణీ, తదితర విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డెలవరీలు కచ్చితంగా ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలన్నారు.గర్భిణీలకు అన్నిరకాల టీకాలు అందవలసినవి సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రాకేష్ కుమార్, హోమియోపతి వైద్యులు ప్రవీణ్ కుమార్, స్టాఫ్ నర్స్ శంకరమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: