గుండాల ఆళ్లపల్లి అక్టోబర్ 29 (మన్యం మనుగడ) గిరిజన యోధుడు కొమరం భీమ్ అని ఆళ్ల పల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొమరం భీమ్ వర్ధంతి సభ ఆదివాసి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడుతూ కొమరం భీమ్ గిరిజనుల కోసం వెలలేని కృషి చేశారని అన్నారు. భూమి, భుక్తి , విముక్తి కోసం పోరాడిన మహా నాయకుడు అని ఆమె అన్నారు. నిజాం ప్రభుత్వంపై పోరాడిన యోధుడు అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , ఏ ఈ డబ్ల్యూ సి ఎ జిల్లా అధ్యక్షులు ఈ కృష్ణయ్య , చాట్ల శ్రీనివాసరావు, టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగ రాంబాబు , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: