మన్యం టీవి, పినపాక: రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు నూతన పంటలు, పద్ధతులను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. పినపాక మండలం లో జానంపేట లో ఆయన ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు చేసిన ప్రతి రైతు 30 సంవత్సరాల వరకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చన్నారు. ఇతర సాగు పంటలకు ఎకరానికి వాడే నీరు ఆయిల్ ఫామ్ సాగుకు ఐదు ఎకరాల వరకు వాడవచ్చునని, కేంద్ర రాష్ట్ర లు మూడు సంవత్సరాల వరకు సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తుందని అన్నారు.ఎలాంటి నేల కైనా ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.రైతులందరూ సమిష్టిగా ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి లాభాలు గడించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుభద్రాదేవి వాసు బాబు, ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ సుబ్బారెడ్డి, సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మహేష్, ఎంపీటీసీలు , సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: