CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రారంభమైన కోట మైసమ్మ జాతర: జాతరకు టి ఎస్ ఆర్ టి సి బస్సులు ఏర్పాటు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో దసరా పురస్కరించుకొని శ్రీ కోట మైసమ్మ అమ్మవారు దేవాలయ ప్రాంగణంలో జాతర మహోత్సవం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న జాతర రంగుల రత్నం లో ఎక్కి కూర్చుని సందడి చేశారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ హరి సింగ్ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, మేకల శ్యామ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇల్లందు నుంచి కోట మైసమ్మ జాతరకు ఆర్టీసీ బస్ ప్రారంభించిన ఇల్లందు బస్టాండ్ కంట్రోల్ చిట్టిబాబు తెలిపారు. ప్రతి ఒక్కరికి బస్ ఛార్జి రూ.10 బస్సులో నేరుగా కోట మైసమ్మ ఆలయం వద్దకు భక్తులు సురక్షిత చేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు.

Share it:

Post A Comment: