చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా డిమాండ్ చేశారు. శనివారం బెండాలపాడు గ్రామంలో జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... సామాన్యులు నేడు నిత్యవసర సరుకులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయని, ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్న సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదన్నారు.ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బొర్ర కేశవులు, జడ శీను, కారం నరసింహారావు, వర్ష వీరభద్రం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: