మన్యంటీవి, దమ్మపేట:తక్కువ కాలం లోనే కూచిపూడి న్రుత్యం లొ ప్రతిభ కనపరచిన కుమారి కొనకళ్ల ధాయిస్య శ్రీ, కుమారి చిలుకుబొత్తుల విష్ణుప్రియ లను పలువురు ప్రశంశించారు. అంతర్జాతీయ కూచిపూడి న్రుత్య దినోత్సవం సందర్భంగా దమ్మపేట ఆశ్రమంలో ఏర్పాటు చేసిన న్రుత్య ప్రదర్శన కార్యక్రమంలో పలువురు చిన్నారులు, కూచిపూడి నాట్యంలొ తమ ప్రతిభలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ చిన్నారుల ప్రదర్శన పలువురు ఆహుతలను ఆకట్టుకొంది. కుమారి ధాయిస్య శ్రీ తల్లి తండ్రులు కొనకల్ల సత్యనారాయణ, రమా శ్రవంతి ఉద్యొగ రీత్యా బిహార్ లొ ఉంటారు. సాంప్రదాయ న్రుత్యం పై అభిమానంతో తమ కుమార్తె ను, అశ్వారావుపేట లొ ఉంచి న్రుత్యం నేర్పించారు. కేవలం మూడు నెలలోనే మంచి ప్రావీణ్యం సంపాదించడంతో అమె గురువు అయిన సర్వింద్ ను, అమె తల్లిదండ్రులను నిర్వహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లొ కళాకారిణి లతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post A Comment: