CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు లో సీనియర్ నటులు,అభ్యుదయ వాది ఆర్.నారయణ మూర్తి పర్యటన

Share it:

 




మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో బుధవారం అభ్యుదయ వాది,తెలుగు సినిమాలో తన ట్రెండ్ సెట్ చేసిన ట్రెండ్ సెట్టర్,నటులు, దర్శకుడు ఆర్.నారయణ మూర్తి పర్యటించారు. అనంతరం మణుగూరు సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుల చట్టాల వల్ల రైతాంగానికి ఏలాంటి నష్టం ఉందో *రైతన్న* సినిమాలో చూపించారు అని, సినిమా ను అందరూ ఆదరించాలని వారు కోరారు. రైతులు చేస్తున ఆందోళనకు మద్దతుగా రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం,అవలంబిస్తున్న విధానాలను అర్.నారాయణ మూర్తి వివరించారు.ఈ సమావేశం లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య,టీడీపి జిల్లా వాసిరెడ్డి చలపతిరావు, సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అర్. మధుసూదన్ రెడ్డి,మహిళ సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి రాంగోపాల్,సీపీఐ మణుగూరు పట్టణ మండల కార్యదర్శి లు సర్వర్,సుధాకర్,జిల్లా సమితి సభ్యులు అక్కి నర్సింహారావు, వేల్పుల మల్లికార్జున్,సర్పంచ్ సతీష్,భవన నిర్మాణ కార్మికులు,ఆటో యూనియన్ నాయకులు,యూత్,కార్మికులు ,ఓ బి కార్మికులు పాల్గోని శాలువాలు,పూల దండల తో సన్మానించారు.

Share it:

Post A Comment: