CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

Share it:

 


  మన్యం టీవీ, అశ్వాపురం:భారత జాతిపిత మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా మొండికుంట గ్రామంలో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన టిఆర్ఎస్ పార్టీ అశ్వాపురం మండల కార్యదర్శి, మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రజలందరూ తరతమ భేదాలు లేకుండా భాగస్వామ్యులు కావాలన్నారు.గాంధీ చూపిన అహింసా మార్గంలో,కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా సాధించుకున్నామన్నారు.ఈ ఏడు సంవత్సరాల కాలంలో దేశానికే తెలంగాణా ఆదర్శంగా నిలిచిందన్నారు.గ్రామ స్వరాజ్యం కోసం యువత ముందడుగు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,ఎంపీటీసీ కమటం నరేశ్, గ్రామ పెద్దలు జాలే రామకృష్ణారెడ్డి,తెల్లం లాలయ్య, వీఆర్వో వరలక్ష్మి,కార్యదర్శి సైదులు,వార్డుసభ్యులు ఉప్పల్ రెడ్డి,శివారెడ్డి,రాజేష్,వసంత రావు,ప్రశాంతి,రేషన్ డీలర్ కందాల ఈశ్వర్, అంగన్ వాడి టీచర్ పాయం లత,ఆశా వర్కర్ కృష్ణవేణి, వీఆర్ఏలు ప్రదీప్,వెంకటేశ్వర్లు గ్రామస్థులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: