గుండాల ఆళ్ల పల్లి అక్టోబర్ 16 (మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. రాయి గూడెం గ్రామానికి చెందిన ఈసం సమ్మయ్య బుధవారం రామాంజి గూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సమ్మయ్య శుక్రవారం మృతి చెందాడు. సమ్మయ్య కు భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు సాత్విక, శశి లేక ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో ఉండిపో వలసిన పరిస్థితి నెలకొంది
Post A Comment: