చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : జిల్లాలో ఉత్తమ మండల విద్యాశాఖ అధికారి గా చంద్రుగొండ ఎంఈవో సత్యనారాయణ ఎంపికయ్యారు.. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు అనుదీప్ చేతుల మీదగా ప్రశంసా పత్రం అవార్డును అందజేశారు. గురు పూజోత్సవం సందర్భంగా ఇవ్వాల్సిన అవార్డును లాక్ డౌన్ నిబంధనలు సడలించడం తో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఉత్తమ ఏం ఈవో నియమితులైన సత్యనారాయణను ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుల్ల సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు అభినందించారు.
Navigation
Post A Comment: