అయోమయంలో మండల టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పదవి....... చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండలంలో కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం గా మండల అధ్యక్షుడు ద్వారా మండల ఉపాధ్యక్షులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు రాజకీయ పలుకుబడి ద్వారా మళ్లీ మండల ఉపాధ్యక్షుడిగా కొత్త పేరు భూపతి శ్రీనివాసరావు ని చెబుతున్నారు. దీనికి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దార వెంకటేశ్వర్లు వివరణ అడగగా . మాకు ఎటువంటి సమాచారం కానీ ఉత్తర్వులు కానీ ఈ నియామకం పట్ల సమాచారం తెలియదని అన్నాడు. ఈ విషయం ఉపాధ్యక్షులుగా నియమితులైనట్లు భూపతి శ్రీనివాసరావు పత్రిక విలేకరులకు తెలియజేసినారు. ఈ ప్రచారం పట్ల మండల టిఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
Post A Comment: