గుండాల అక్టోబర్ 3( మన్యం మనుగడ) ఈ నెల 5న జరిగే సడక్ బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశం న్యూ డెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వర్ మాట్లాడుతూ. పోడు భూముల పరిరక్షణ కై తలపెట్టిన బందును జయప్రదం చేయాలి వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లు గడుస్తున్నా పోడు భూములకు పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు అశ్వరావుపేట నుండి అదిలాబాద్ వరకు జరిగే సడక్ బంద్ ను విజయవంతం కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు జే సీతారామయ్య, ముక్తి సత్యం, ఈ సం పాపారావు, ఎద్దులపల్లి సత్యం, కోరం సీతారాములు, నరేష్ , వాగబోయిన రమేష్ , పరిషిక రవి, వజ్జ ఎర్రయ్య, పాయం నాగేశ్వరరావు, గోవింద నరసింహారావు, జార్జి , ఈ సం కృష్ణ , రియాజ్ , జగన్, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: