ఐసిడిఎస్ సిడిపిఓ కే ఎం తార
గుండాల అక్టోబర్ 20 (మన్యం మనుగడ) చిరుధాన్యాలలో పోషకాలు ఎక్కువ అని ఐ సి డి ఎస్ సి డి పి ఓ కే ఎం తార అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిరుధాన్యాల ఆహార పండుగ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలలో పోషకాలు ఎక్కువగా ఉండటం వలన రోగాలు దరిచేరవని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు చిరుధాన్యాలను తమ ఆహార అలవాట్లుగ మార్చుకోవాలి అన్నారు. చిరుధాన్యాలను వండిపాఠశాల సిబ్బందికి మరియు అవగాహన కార్యక్రమంకు వచ్చినవారికి వడ్డించారు. ఈ కార్యక్రమానికి ఉండాల సర్పంచ్ కోరం సీతారాములు, సూపర్వైజర్లు అనురాధ , సాలమ్మ , సక్కుబాయి లు పాల్గొన్నారు
Post A Comment: