పెన్షన్ రాక దిన స్థితి లో మగ్గుతున్న ఆదివాసి దివ్యాంగుడు
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు
మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో గోలిశెట్టి బాలకృష్ణ అనే దివ్యాంగుడు కష్టాల ఊబిలో కొట్టిమిటలాడుతున్నాడు. బ్రతకడానికి దీనస్థితి, పూట గడవని పరిస్థితి, మానవత్వం వదిలి చోద్యం చూసినటు చూస్తూ తిరుగుతున్న జనాలు, పట్టించుకోని బంధువులు, గతంలో పెన్షన్ వచ్చేది కానీ ఇప్పుడు రావడం లేదు ఎందుకు రావడం లేదు అని కనీసం ప్రయత్నించని వ్యక్తి లేరు. గతంలో వచ్చిన పెన్షన్ తో ఒక చిన్న షెడ్డు వేసుకొని చుట్టూ పరదాలుతో ఇల్లు నిర్మించుకుని అలా జీవిస్తూ వుండేవాడినని, పెన్షన్ ఆగిపోవడంతో భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నాననీ నెల క్రితంవచ్చిన గాలివానలకు పరదాలు చినిగి పోయి ఇల్లు దారుణంగా తయారైందని దయా హృదయం గల దాతలు ఎవరైనా తనని ఆదుకోవాలని వేడుకున్నారు.
Post A Comment: