కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం సభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఫ్రోటో కాల్ పాటించడం లేదని మొన్న జరిగిన ఓ అధికారి కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు బహిరంగంగా ,బాహాటంగా మంత్రి పువ్వాడ అజయ్ సాక్షిగా ప్రకటించి పై స్ధాయి అధికారులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించిన విషయం మరువక ముందే మరలా అదే రిఫిట్ అవుతుందని విమర్శకులు విమర్శిస్తున్నారు.విళరాల్లోకి వెళితే తెలంగాణా రాష్ట్ర మంతా దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం రేషన్ కార్డులు వున్న ప్రతి ఆడపడుచూకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గాంధి జయంతి సందర్భంగా పంపిణి కి ముహూర్తం ఖరార్ చేసి షురూ చేసారు.కాని ప్రోటోకాల్ చిక్కంతా ఇక్కడే మొదలైంది.కొత్తగూడెం నియోజకవర్గం లో చీరలు పంపిణి కార్యక్రమంలో వనమా గారి ప్లెక్సీ మీద సాక్షాత్తు మంత్రి పువ్వాడ అజయ్,ప్రభుత్వ చీప్ విప్ రేగా కాంతారావు గార్ల ఫోటోలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వీరివురి ఫోటోలు లేని ప్లెక్సీలు దర్శనమిస్తుంటే ఔరా ఏమిటి ఈ విడ్డూరం ప్రోటోకాల్ రగడ అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.ఏది ఏమైనా వనమా ప్రతి ప్రోగ్రాంలో ఈ ప్రోటోగాల్ రగడ ఏమిటని ప్రశ్నార్ధకంగా మారింది.ఈ విషయమై ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
Navigation
Post A Comment: