CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిజెవైయం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిస్టిబొమ్మ దహన కార్యక్రమం

Share it:

 


  • బిజెవైయం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిస్టిబొమ్మ  దహన కార్యక్రమం 
  •  ములుగు బిజెవైయం జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ 


మన్యం టీవీ మంగపేట.


ఆదివారం నాడు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు  భానుప్రకాష్ ఆదేశాల మేరకు భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు కొత్త సురేంద్ర  ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహన క్రియ చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి *భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటి కృష్ణ  మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం హుజురాబాద్ ఎలక్షన్ లో కేంద్ర మంత్రివర్యులు  కిషన్ రెడ్డి మరియు ఈటల రాజేందర్  ప్రచారం చేస్తున్న సమయంలో టిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడాన్ని  ఖండిస్తూ  యువమోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వా దిష్టి బొమ్మ దహనం జరిగిందని అన్నారు. సిఎం కేసీ ఎన్ని గుంట నక్కలు  వేషాలు వేసిన హుజరాబాద్  ప్రజలు ఏకపక్షంగా ఈటల రాజేందర్ అన్న కు మద్దతుగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ముందు త్రిబుల్ ఆర్ సినిమా అక్టోబర్ 2న  ప్రొజెక్టర్ మీద  సినిమా చూపిస్తామన్నారు . తెరాస ప్రభుత్వం హుజరాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు . ఎన్ని వేషాలు వేసినా ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ బీజేపీ వైపే ఉన్నారు అని అన్నారు. ఈటల రాజేందర్ అన్న మీద ఈగ వాలినా టిఆర్ఎస్ గుండా నాయకులకు ఊహించని రీతిలో ప్రతిదాడి ఉంటుందని హెచ్చరించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు రైతులకు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని హెచ్చరించారు 2023లో గోల్కొండ కోట మీద కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని అని అన్నారు .ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కిసనమోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణకర్ ములుగు మండల అధ్యక్షులు ఉమ్మడి రాకేష్  భారతీయ జనతా పార్టీ జిల్లా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి  గద్దల రఘు, మైనారిటీ మోర్చా జిల్లా ప్రదాన కార్యాదర్శి  మీరా గారు,బీజేవైఎం జిల్లా కార్యదర్శి కళ్ళేపల్లి ప్రవీణ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్కతుర్తి శివ,ములుగు మండల అధ్యక్షులు కనుకుల అవినాష్ , మెడుగుల మమాన్, నాగ సాయి ,సాగర్  నిగ్గులసాయి , ఆకాష్  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: