CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్ వాడీ లను ప్రభుత్వం విస్మరిస్తుంది : సిఐటియు

Share it:



మన్యం టీవీ :  ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అనేక సంవత్సరాల నుండి అంగన్ వాడీ విధులు నిర్వహిస్తూ ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కార్గో, రేషన్ షాప్ లాగా  స్కూల్లో ఉండకుండా రోడ్ల వెంబడి తిరుగుతూ వలసి వస్తుందని  సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఈ సం వెంకటమ్మ కన్వీనర్ ఆలేటి కిరణ్ అన్నారు. అంగన్ వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో  సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కళ్ల పెళ్లి మరియా అధ్యక్షతన  వారు మాట్లాడుతూ.. ఆనాటి ప్రభుత్వం  చిన్నపిల్లలకి విద్య నేర్పించాలని పౌష్టికాహారం అందించాలని మంచి ఉద్దేశంతో స్కూలు ఏర్పాటు చేశారు. కానీ నేడు విధులు నిర్వహిస్తున్న టీచర్లను అనేక ఇబ్బందులు పెడుతూ పిల్లలకు విద్య అందించకుండా టీచర్లను తమ ఇష్టానుసారంగా వేర్వేరు పనులు కేటాయిస్తూన్నారని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని ఓ వైపు ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంటే వాటిని పరిష్కరించకుండా   ప్రభుత్వాలు పొమ్మనలేక పొగ పెట్టేవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా స్కూల్లో వద్దకే బియ్యం,నిత్యావసర సరుకులు అందజేయాలని, గ్యాస్ బిల్లులు,ఇంటి అద్దెలు చక్రం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడర్ ఫాతిమా యాకమ్మ ఆలేటి సంధ్య, ఆదిలక్ష్మి ,అరుణ, రమణి,పద్మ,దేవేంద్ర,మోహిని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: