మన్యం మీడియా ప్రతినిధి/దమ్మపేట:: దేవి శరన్నవ రాత్రులు సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. మండలంలోని నాగుపల్లి గ్రామంలో అమ్మ వారిని దర్శించుకొని, అక్కడ ఉన్న ఆడపడుచులు,చిన్నారులతో కలిసి కొలాట నృత్యం అడారు.దేవాలయ కమిటీ వారు ఎమ్మెల్యే మెచ్చా ను గౌరవంగా శాలువా కప్పి సన్మానించారు. అనంతరం దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. అశ్వారావుపేట శాసనసభ్యులు.ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల జెడ్పీటీసీ-పైడి వెంకటేశ్వరరావు,
ఎంపీటీసీ-అంగోత్ భాస్కర్ రావు,గ్రామ పంచాయతీ సర్పంచ్-ఇస్లావత్ నాగమణి,గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్-కందిమళ్ల సర్వేశ్వరరావు, కృష్ణారావు, వెంకటేశ్వర్లు,మాధవరెడ్డి,గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి-శ్రీను,అబ్ధుల్ జిన్నా,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: