CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి కార్యకర్తపార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ఫ్లనరీ,విజయగర్జన సభను విజయవంతం చేయాలి : టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య

Share it:

 






  • ప్రతి కార్యకర్తపార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
  • ఫ్లనరీ,విజయగర్జన సభను విజయవంతం చేయాలి
  • *టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య

 మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ముఖ్యకార్యకర్తలకు,ప్రజాప్రతినిధులకు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ గ్రామాల్లో 

పార్టీ బలోపేతమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి వర్యులు  కల్వకుంట్ల తారక రామారావు,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశించారు.

అదే విధంగా హైదరాబాద్ లో ఈ నెల 25న జరిగే ప్లీనరీకి ప్రతి ఒక్కరూ గులాబీ దుస్తులు ధరించాలని ఆయన తెలిపారు.

అదే విధంగా ఈ నెల 27న జరగబోయే పినపాక నియోజకవర్గ స్థాయి మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్ జరిగే సన్నాహక సమావేశానికి కరకగూడెం మండలంలోని పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున హాజరు కావాలని పార్టీ అధ్య‌క్షులు రావుల సోమయ్య తెలిపారు.

వచ్చే నెల 15వ తేదిన టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్బంగా వరంగల్ లో జరిగే 'తెలంగాణ విజయగర్జన' సభకు భారీ స్థాయిలో ప్రజలను,కార్యకర్తలను తరలించేందుకు గ్రామ కమిటీ అధ్యక్షులు,సర్పంచులు భాద్యత తీసుకోవాలని ఆయన సూచించారు.

గ్రామ కమిటీ అధ్యక్షులు,సర్పంచులు

ప్రతి గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ,పార్టీని బలోపేతం చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,గ్రామ కమిటీ అధ్యక్షులు పోలెబోయిన క్రిష్ణారావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,వట్టం వెంకటేశ్వర్లు,భూర్గంపహడ్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,ఆత్మ కమిటీ డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,కరకగూడెం ఎంపీటీసీ యాలిపెద్ది శైలజ,టీఆర్ఎస్వీ పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి నేతాజి,రేగా లక్ష్మణరావు,సర్పంచుల సంఘం అధ్యక్షులు పాయం నర్సింహారావు,పార్టీ మహిళల అధ్యక్షురాలు కాసు లావణ్య,బీసీ సెల్ అధ్యక్షులు ముగిలిపువ్వు సురేష్,ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం రాజబాబు,ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్టా ఏడుకొండలు,కార్మిక సంఘం అధ్యక్షులు చెన్నూజు రాజేశ్వరరావు,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,కరకగూడెం ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు రావుల రవి,సర్పంచులు,ప్రజాప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: