మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ను మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మలాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 18 రేషన్ షాపులకు గాను ఒక్కొక్క రేషన్ షాప్ కు 81% చొప్పున మొత్తం పదివేల చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో నేటి నుండి పదవ తారీకు వరకు చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను వారికి అందిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరల టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గలిగే సావిత్రి, ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, బొర్ర రాజశేఖర్, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ వీరభద్రం, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నర్సింహారావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: