మన్యం టీవి, ఆశ్వారావుపేట: మండల కేంద్రం లో కొమరం భీమ్ 81 వ వర్దంతి ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భం గా కొమరం భీం విగ్రహానికి అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయుకరాలు వగ్గెల పూజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొమరం భీమ్ చూపిన మార్గంలో ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలన్నారు. కొమరం భీం మృతి చెంది 81యేళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రాక ప్రతి యేటా వందలాది మంది మరణిస్తున్నారన్నారు. విద్య, వైద్యం, విద్యుత్, సాగునీరు, తాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూమిలేని గిరిజనులకు మూడు ఎకరాలు ఇవ్వాలని గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాయం దుర్గారావు, బండారు సూరి నారాయణ, తాటి పోతురాజు, కంగాల ఆదినారాయణ, పునెం వెంకటేశ్వర్లు, కేసరీ లక్ష్మి, వగ్గెల అనుసూర్య, కుర్సం రమేష్, పద్దం శ్రీను, కట్రం స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: