ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మన్యం టీవీ మంగపేట.
స్వతంత్ర భారత్ లో మహాత్ముని సేవలు మరువలేనివని బాపు చూపిన బాట బంగారు బాట అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో గాంధీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామం నుండి నేటి వరకు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలు సైతం గుర్తుంచుకునేలా గాంధీజీ చిరస్మరణీయుడయ్యారని అన్నారు గాంధీజీ చూపిన అహింసా మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం ఉందన్నారు. పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముని మాటలు ఎప్పటికీ మరువలేనివి అన్నారు గాంధీజీ సేవలను ఆయన కొనియాడారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ అధ్యక్షులు కటుకూరి సాంబశివరావు మాజీ సర్పంచ్ వత్సవాయి శ్రీధర్ వర్మ భార్గవ ఆటోమొబైల్స్ హీరో షోరూం యజమాని నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నరిసింహారెడ్డి విజయ్ వేణు మరియు వికాస్ ఆగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు రూప భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు....
వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాష్ట్రపతి లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ ఆగ్రి ఫౌండేషన్ చైర్మన్ నాసిరెడ్డీ సాంబశివ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రి దేశం గర్వించదగ్గ నేత అని గొప్ప రాజనీతిజ్ఞుడు అని జాతికి శాస్త్రి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వి ఏ ఎఫ్ కార్యాలయ సిబ్బంది స్థానిక రైతులు పాల్గొన్నారు.
Post A Comment: