CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యంతో సీనియర్ రాజకీయ నాయకులు పొన్నెకంటి వీరభద్రం కన్నుమూత..

Share it:



మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పొన్నెకంటి వీరభద్రం అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ కాకర్ల చేరుకొని వీరభద్రం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీపీ సోనీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ఎంపీటీసీ మధుసూదన్ రావు, రామిశెట్టి రాంబాబు, పిఎసిఎస్ చైర్మన్ చీమలపాటి బిక్షం, తోట శ్రీను, తదితరులు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Share it:

TELANGANA

Post A Comment: