మన్యం టీవి, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మామిళ్ల వారి గూడెం గ్రామంలో కొమ్మిటి మహేశ్వర రావు అనే వ్యక్తి యొక్క ఇల్లు కరెంటు తీగలు తెగి పడిపోవడంతో పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు, కానీ అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ ఇంట్లో 50 వేల రూపాయలు నగదు, నిత్యావసర సరుకులు, బట్టలు, టీవి, బీరువా పూర్తిగా కాలిపోయాయి, నష్టం విలువ సుమారు రెండు లక్షలు ఉండొచ్చు అని అంచనా. దగ్ధమైన ఇల్లు చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి మీదుగా కరెంటు తీగలు ఉండడం విద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు చెప్పారని ఈ నష్టానికి కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అని స్థానికులు వాపోయారు.
Post A Comment: