మన్యం మీడియా ప్రతినిధి/ ములకలపల్లి:: ములకలపల్లి మండలం లోని కొమ్ముగూడెం, నల్లముడి, సీతాయిగూడెం, పాతగంగారం, టేకుల గుంపు, పాలవాగు, ముత్యాలంపాడు, కొత్తజిన్నెలగూడెం,
పాతజిన్నెలగూడెం, రాసన్న గూడెం. పలు ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించిన పూల పండగ (బతుకమ్మ) సంబరాల్లో టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు జారే ఆదినారాయణ ఉత్సాహంగా పాల్గొని గిరిజన ఆడపడుచులకు పసుపు, కుంకుమలు అందజేసి కోలాట నృత్యాలలో కలిసి ఆడి పాడారు. గిరిజన మహిళలు జారే ఆదినారాయణ ను గౌరవంగా శాలువాలతో సత్కరించారు. ఈ సంబరాల్లో సీతాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కారం సుధీర్, ములకలపల్లి మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్దార్, పాండ్ర బన్ని, సున్నం సామేలు, మడకం సురేష్, సోడెం కళ్యాణ్ చక్రవర్తి, వాడే బొజ్జి, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు దుగ్గి సంపత్ కుమార్, ఆదివాసి యువతీ, యువకులు ,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: