మన్యం టీవీ మంగపేట.
మొక్కలతో చెలిమి పర్యావరణానికి మరియూ యావత్తు మానవాళికి కలిమి అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కామర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం ఆయన వికాస్ అగ్రి పౌండేషన్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఇటీవల తాను ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లా పాడేరు సుగంధ ద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో మొదాపురం అనే గ్రామంలో కాఫీ మరియూ మిరియాలు పంట క్షేత్రాలను పరిశీలిస్తున్నప్పుడు స్పైసెస్ బోర్డు అధికారులు బి కళ్యాణి రత్న సాంబశివరావు కలిసి కాఫీ మొక్కలుమరియూ తెల్లేడు (సిల్వర్ ఓక్) మొక్కలను తనకు బహుకరించారని తన పర్యటనకు జ్ఞాపకంగా ఈ మొక్కలను ఈరోజు తన కార్యాలయ ప్రాంగణంలో నాటి నట్లు తెలిపారు ఈ సందర్భంగా మొక్కలు బహూకరించిన పాడేరు స్పైసెస్ బోర్డు అధికారులకు సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరు మొక్కల పెంపకాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ముఖ్యమైన సందర్భాల్లో తమ జ్ఞాపకంగా తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు మానవాళి మనుగడకు మొక్క దిక్కు అనే నానుడిని మరవ వద్దని కోరారు గడిచిన వర్షాకాలం సీజన్లో సుమారు 400 మొక్కలు వివిధ సందర్భాల్లో నాటినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వికాస్ ఆగ్రి పౌండేషన్ డైరెక్టర్స్ నేలపట్ల శేశారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: