CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం స్థలం పర్మిషన్ ఇప్పించండి..

Share it:

 



మన్యం టీవీ :  జూలూరుపాడు, అక్టోబర్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు                               బహుజన సమాజ్  పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కొరకు స్థలం పర్మిషన్ ఇప్పించాలని కోరుతూ ఎండిఓ చంద్రశేఖర్ మరియు వెంగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బి ఎస్ పి జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ.. అంబేద్కర్  విగ్రహం మండల కేంద్రంలో ప్రతిష్టించాలని, కొన్ని బహుజన సంఘాలు వెంగన్నపాలెం మెయిన్ సెంటర్ చండ్రుగొండ క్రాస్ రోడ్ వద్ద గతంలో అంబేద్కర్  విగ్రహం కోసం దిమ్మె నిర్మించడం జరిగిందని అన్నారు. కానీ రోడ్డు విస్తరణలో ఆ దిమ్మె కుల్చారన్న విషయం తెలుసుకొని, బహుజన సంఘాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించగా, అదే స్థలంలో అంబేద్కర్  దిమ్మె కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. అయినా  రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మాట నిలబెట్టుకోలేక పోయారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక సర్పంచ్ గలిగే సావిత్రి కి  అదే విధంగా స్థానిక జూలూరుపాడు ఎండిఓ చంద్రశేఖర్ కి  అంబేద్కర్  విగ్రహం కోసం ఏర్పాటుచేసిన పాత దిమ్మె స్థలంలోనే మరలా దిమ్మె శంకుస్థాపన చేసుకోవడం కోసం ఆ స్థలం లో ఏవైనా అడ్డు వస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది తో తొలగించి బహుజనుల బంధువు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహం వెంగన్నపాలెం మెయిన్ రోడ్డు పక్కన ప్రతిష్ఠించు కోవడం కొరకు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: