మన్యం టివి ,దుమ్ముగూడెం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.సి.పిగూండాలు తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై,కార్యకర్తలపై భౌతిక దాడులను నిరసిస్తూ తెలంగాణ తెలుగు దేశం పార్టీ మండల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమరం దామోదర రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థను,వై.సి.పి పార్టీతుంగలోతొక్కుతుందని,ప్రజలు స్వేచ్ఛ గా బ్రతికే రోజులు ఆరాష్ట్రం లో,లేవని, రానున్న కాలంలో జగన్ పార్టీ కి బుద్దిచెప్పేరోజులుదగ్గరలో ఉన్నాయని, ప్రజాస్వామ్య వాదులు, ప్రతిపక్షపార్టీలు,ముఖ్త కంఠంతో తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.ఇందులో కెల్లా వేణు,దండుగులరాధాకృష్ణ,మచ్చాశ్రీరాములు,మిడియం వీరయ్య, మచ్చామారయ్య,ధర్మయ్య, రామయ్య,బట్టామహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: