CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సకాలంలో రుణాలు చెల్లించి,వడ్డీ రాయితీని పొందండి... డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం....

Share it:


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:
రైతులు సకాలంలో రుణాలు చెల్లించి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీని పొందాలని డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. గురువారం స్థానిక  డిసిసిబి బ్యాంకు నందు ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఈ ఏడాది డీసీసీబీ ద్వారా 360 కోట్ల రూపాయలు బంగారంపై రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందని, మరో వంద కోట్లు రుణాలు ఇస్తే లక్ష్యాన్ని పూర్తయినట్లు అవుతుందన్నారు. ఈ ఏడాది 12 వందల కోట్ల రూపాయలు పంట రుణాలు ఇవ్వడం జరిగిందని, అనుకున్న సమయానికి రైతులకు రుణాలు ఇవ్వడంలో  సహకార సంఘాలు ముందుంటాయి అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ సీఈవో అల్లూరి వీరబాబు, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు, వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాలోత్ బోజ్యనాయక్, బ్యాంకు ఇబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: