CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

తాడ్వాయి మండలములో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,ములుగు ఎమ్మెల్యే సితక్కతో పాటు కాంగ్రెస్ నేతలను ప్రభుత్వ అక్రమ అరెస్టుకు నిరసనగా మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా  మండల అధ్యక్షుడు జలపు అనంత రెడ్డి మాట్లాడుతూ. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు శాంతి యుతంగా ర్యాలీ  నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని, సితక్కతో పాటు పలువురు నాయకులను ప్రభుత్వం పొలిసులతో అక్రమ అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులను ప్రజలు చూస్తున్నారని,రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్  పులి సంపత్,స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్,ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిరిల వెంకన్న, జిల్లా నాయకులు అరేం లచ్చు పటేల్,పీఏసీఎస్ డైరెక్టర్లు రంగరబోయిన జగదీష్, ఆశాడపు మల్లయ్య, తాడ్వాయి,కల్వపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, శ్రీనివాస్, నాయకులు సాదు చక్రపాణి,అనుమాండ్ల రాజీరెడ్డి,పోశాలు,కట్ల ఓదెలు, శంకర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: