మన్యంటీవి, అశ్వారావుపేట:మండల పరిధిలోని తిరుమలకుంట బతుకమ్మ వేడుకలు సోమవారం కొనకళ్ల సత్యనారాయణ మేఘ ఇంజనీర్ & బీహార్ ప్రాజెక్ట్ సైట్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిధిగా అశ్వారావుపేట సీఐ బంధం ఉపేందర్ రావు హాజరయ్యారు. అతిధిగా వచ్చిన సీఐ బంధం ఉపేందర్ రావుకు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ బంధం ఉపేందర్ రావు మాట్లాడుతూ బతుకమ్మ అంటే ప్రకృతి పండుగని, ప్రకృతిలోని రంగురంగు పువ్వుల ద్వారా గౌరీదేవిని పూజిస్తూ
తెలంగాణ మహిళలు గొప్పగా జరుపుకునే పండుగ అన్నారు. బతుకమ్మ అంటే పచ్చని పాడి పంటలు, సుఖ సంతోషాలు, కులమతాలకు అతీతంగా అందరు ఆప్యాయతతో కలిసి ఉండి, బతుకునే నేర్పేదేనన్నారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు, తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, సోషల్ మీడియా ఇంచార్జ్ జుజ్జురి మనోహర్, మండల తెరాస, యూత్ లీడర్ నాగ కిషోర్, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు తరుణ్ తేజ, మాజీ సర్పంచ్ సున్నం రామలక్మయ్య, మండల యువజన తెరాస ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఈశ్వర్, ధానెల్ రెడ్డి, పాల్గొన్నారు.
Post A Comment: