మన్యం టీవి,ములకలపల్లి : మాదారం గ్రామంలో ములకలపల్లి జడ్పీటీసీ,టి పి సి సి మెంబర్ సున్నం నాగమని ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు.సున్నం నాగమణి మాట్లాడుతూ నిరుద్యోగ యువతి,యువకులు విద్యార్థుల సమస్యల పరిస్కారం కోసం గాంధీ జయంతి అక్టోబర్ 2 వ తేది నుంచి డిసెంబరు 9 వ తేది వరకు కాంగ్రేస్ పార్టీ టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సి ఎల్. పి నేత భట్టి విక్రమార్కఅద్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలియపరిచారు.కనుక రాష్ట్రంలో నిరుద్యోగులకు కాలీగా ఉన్న లక్షా 91వేలు ఉద్యోగాలు వెంటనే భర్తీ చెయ్యాలని,నిరుద్యోగులకు నిరుద్యోగభృతి నెలకు3,016 రూపాయలు వెంటనే ఇవ్వాలని,కె.జి.నుంచి పి.జి.వరకు ఉచిత విద్య అమలు చేయాలని,పీజు రీయింబర్సుమెంట్ వెంటనే అమలు చెయ్యాలని,ఆదివాసులకు పొడుభూముల హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని,కె.సి.ఆర్.నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడానికి ప్రతి ఒక్కరు కదలి రావాలని ఈ సందర్బంగా సున్నం నాగమణి కార్యకర్తలకు విజ్ణప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: