హాజరైన ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు
మన్యం టీవీ వెబ్ డెస్క్:
హైదరాబాదు లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పినపాక నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం మే లక్ష్యంగా,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేయాలి అని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో 25న జరిగే ప్లీనరీ తో పాటు వచ్చే నెల 15 న వరంగల్ లో జరిగే మహాగర్జనకు భారీ స్థాయిలో ప్రజలను,కార్యకర్తలను, తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు ఎంపీపీ లు, జడ్పీటీసీలు,సొసైటీ చైర్మన్ లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: