CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా దేవి శరన్నవరాత్రి మహో త్సవం

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం దేవి శరన్నవరాత్రి మహోత్సవం 4 వ సంవత్సర పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.విగ్రహ దాత దొడ్డ రమేష్ పావని దంపతులు, రామ భక్త హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి అనగా శుక్రవారం వరకు అశ్వాపురం గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ రామ భక్త హనుమాన్ సేవ సమితి మరియు గ్రామ భక్తజనుల సహాయ సహకారాలతో శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవ విశేష పూజలతో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం. సహస్ర నామ కుంకుమార్చన లతో శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.శనివారం ఈ రోజు ముగింపు కార్యక్రమంలో అశ్వాపురం తాసిల్దార్ సురేష్ కుమార్,సిఐ సట్లరాజు ,ఎంపీపీ ముత్తినేని సుజాత ముఖ్య అతిథులుగా హాజరై. పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అదేవిధంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి అశ్వాపురం గ్రామం గ్రామ పురవీధుల్లో శ్రీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగును అని కమిటీ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దోసపాటి పిచ్చేశ్వరరావు, దొడ్డ రమేష్,వీర సింహం, బోడపాటి వెంకటేశ్వర్లు, టి కొండలరావు ,ఓరుగంటి బిక్షమయ్య, సతీష్, గుడిపూడి రవిశంకర్, మల్లెల నవీన్ ,అయోధ్య రామయ్య ,రత్నాకర్, శ్రీ,రామ భక్త హనుమాన్ సేవాసమితి కమిటీ సభ్యులు ,భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: