మన్యం టీవీ కరకగూడెం:మత్స్యకారుల ఆర్ధిక అభివృద్ధి లో భాగంగా పల్లెలో ,గ్రామలలో కూడా ఉచ్చితంగా చేప పిల్లలను కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా, జడ్పిటిసి కొమరం కాంతారావు పినపాక నియోజకవర్గ ఆత్మ కమీటీ చైర్మెన్ పటేల్ భద్రయ్య చేతుల మీదుగా మండల కెంద్రంలో ఉన్న పదహారు గ్రామపంచాయతి లకు చేప పిల్లలు పంపిణీ చేశారు. చేప పిల్లల పెంపకం కోసం ఉచితంగా అందించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలాగె పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మరియూ ఐటిడిఏ అధికారులకు రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం గ్రామపంచాయతి కార్యదర్శి భూక్య వెంకటేష్ కరకగుడెం మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పాయం నర్సిహరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, ఉపసర్పంచ్ రావుల రవి టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ, కొంపెల్లి పెద్ద రామలింగం చిట్టిమల్ల ప్రవీణ్ వివిధ గ్రామపంచాయతిల సర్పంచ్ లు,సెక్రటరీలు పాల్గొన్నారు.
Post A Comment: