👉 ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కొట్టే
👉 అన్ని మండలాల విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా కళాశాలను ములకలపల్లిలో నిర్మించాలి.
మాన్యంటివి/ప్రతినిధి:ములకలపల్లి మండలం:ఎస్ఎఫ్ఐ మండల కార్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ములకలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కొట్టే హాజరై ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో నూతనంగా మంజూరు అయిన డిగ్రీ కళాశాలను ములకలపల్లి మండలంలో నిర్మించాలని.ములకలపల్లి మండలంలో నిర్మిస్తే అన్ని మండలాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని, అంకంపాలెంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారని,అక్కడ నిర్మిస్తే కొన్ని మండలాల విద్యార్థులకు దూరం అయ్యే పరిస్థితి ఉందని,అనేక విద్యార్థి ఉద్యమాల ఫలితంగానే డిగ్రీ కళాశాల మంజూరైనట్లు తెలిపారు.డిగ్రీ కళాశాల అన్ని మండలాల విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని,ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తానం వంశీ,మండల నాయకులు కె రాకేష్,పి వేణు దొర,రషీద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: