తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టింటి కానుక బతుకమ్మ చీరలు
మణుగూరు మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ నీ ప్రారంభించిన:జడ్పీటీసీ,ఎంపీపీ
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం పంచాయతీ కార్యాలయం,మరియు మున్సిపాలిటీ పరిధిలోని చేపల మార్కెట్ వద్ద గల రేషన్ షాప్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం. విజయకుమారి పాల్గొని వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని జెడ్పిటిసి పొశం.నరసింహారావు అన్నారు.తెలంగాణ లోని పెద్ద పండుగ అయిన దసరా పండుగను ఆడపడుచులు ఆనందంతో,సంబరంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రతి దసరాకి తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలను అందిస్తుందని తెలిపారు.దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవం కల్పిస్తున్నారని తెలిపారు. అంతేగాక ఎన్నో సాహసోపేతమైన పథకాలు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, అర్హులందరికీ పింఛన్ వంటి పథకాలను కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అమలుచేసి అండగా నిలిచింది అన్నారు.ప్రజలందరు సుఖ సంతోషాల తో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి, వైస్ ఎంపీపీ కె.వి.రావు, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ వీరబాబు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి,ఎంపీటీసీ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,బొలిశెట్టి నవీన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: