CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వినూత్న రీతిలో గాంధీజీకి నివాళులు........ ఐద్వా

Share it:


మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ వినూత్న రీతిలో సంతాపం తెలియజేసస్తు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఇల్లందు మండల కార్యదర్శి ఆలేటి సంధ్య మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుండి భారత దేశాన్నికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులు అందజేశారు. నాడు ఉన్న తెల్లదొరలను తరిమికొట్టిస్వాతంత్రం తెచ్చిన అప్పటికీ,  భారత దేశంలో నేడు మానవ మృగాలు మహిళల పై అత్యాచారాలు, బ్రూణ హత్యలు, చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్న  అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయినా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేసేటటువంటి మహిళలపై లైంగిక వేధింపులు, ప్రేమోన్మాది చర్యలు, యాసిడ్ దాడులు అంటూ నిత్యం జరుగుతున్నప్పటికీ మానవ మృగాలను శిక్షించడంలో లో ఈ ప్రభుత్వం చోద్యం చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఓవైపు మద్యం మరోవైపు విచ్చలవిడిగా ప్రభుత్వ అండదండలతో విక్రయించడం వలన ఈ ప్రభుత్వమే  అత్యాచారాలకు కారణం అయింది అన్నారు. మద్యాన్ని నిషేధించి, మహిళా హక్కులను కాపాడుకుంటూ మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్ బిల్లు పెట్టి వారికి మహిళా సంరక్షణ కల్పించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం అయితే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా )ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు యకమ్మా, మరియ, అరుణ,సుచిత్ర, కాంతమ్మ, సోమలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: