మన్యం టీవీ మంగపేట.
బుధవారం రోజున శ్రీ బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి సంఘం మంగపేట మండల అధ్యక్షుడు మానుపెళ్లి వేణు ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. బహుజన పూజారుల శివసత్తుల సమస్యల గురించి జీవనభృతి,దీప ధూప నైవేద్యం స్కీం,శివసత్తుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని,ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీలో ప్రస్తావించినందుకు గాను మంగపేట శివ సత్తుల ఆధ్వర్యంలో సీతక్క కు పాభిషేకం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ బహుజన పూజారుల శివ శక్తులను ముఖ్యమంత్రి గుర్తించి జీవన భృతి కల్పించాలని, శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పల్లపు హరీష్, కోశాధికారి బడ్డీ రఘుబాబు, మహిళ కార్యదర్శులు,మునెమ్మ, సావిత్రి,సాగరిక. అరుణ. సమ్మక్క. సృజన. భారతమ్మ. రాణి. అనూష. వెంకటలక్ష్మితదితరులు పాల్గొన్నారు.
Post A Comment: