మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెరాస మండల పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 152వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి (జై జవాన్ జై కిసాన్ నినాదం కర్త) జయంతి వేడుకలను తెరాస పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ స్వతంత్ర పోరాటంలో శాంతి అహింస అనే మార్గంలో పోరాడిన గొప్ప మహానీయుడని ఆయన ఆశయాలను ప్రతి భారతీయుడు ఆచరించి గాంధీ చూపిన మార్గంలో నడవాలన్నారు. అంటరానితనం నిర్మూలన గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి నిత్యం కృషి చేసిన మహా నాయకుడు గాంధీజీ అని,గాంధీజీ కన్న కలలు నెరవేర్చడమే కోసం యువత కృషి చేయాలని ఈ సందర్భంగా సునీల్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి వాలియాబి సలీం,పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, ఏటూరునాగారం టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, టౌన్ ప్రధాన కార్యదర్శి దడిగల లక్ష్మణ్,తెరాస పార్టీ సీనియర్ నాయకులు సప్పిడి రామ నరసయ్య,రామన్నగూడెం సర్పంచ్ దొడ్డ కృష్ణ,గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ దన్నపునేని కిరణ్ కుమార్,వావిలాల రాంబాబు,కొండాయి చిన్ని, కుమ్మరి చంద్రబాబు,జాడి బోజ రావు, కందకట్ల శ్రీనివాస్,కాళ్ల రామకృష్ణ,చందా లక్ష్మీనారాయణ,తాండ్ర సతీష్,వార్డు సభ్యులు రంజిత్ కుమార్,రొయ్యూరు ఉపసర్పంచ్ అల్లంల చంటి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: