ప్రభుత్వ లక్ష్యానికి గండి
జి సి సి అదికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు
గుండాల/ ఆళ్ల పల్లి అక్టోబర్ 14 (మన్యం మనుగడ) ప్రభుత్వ ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న రైస్ మాఫియా . కరోనా కష్టకాలంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే కొందరు అధికారులు రైస్ మాఫియాకు సహకరిస్తూ వారికి ప్రభుత్వ బియ్యాన్ని సమకూర్చి ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతూ రైస్ మాఫియాతో కుమ్మక్కై అధికారులు సైతం కాసుల కక్కుర్తి పడి లక్షల రూపాయలను కూడా పెడుతున్నారు. ఆళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ బియ్యాన్ని కేజీ ఐదు రూపాయల చొప్పున కొనుగోలు చేసి పట్టణాలకు తరలించి వాటిని సన్నగా మార్చి నూతన సంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లోకి సరఫరా చేసి 25 కేజీల బియ్యాన్ని వెయ్యి రూపాయలకు పైగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి జిసిసి అధికారులే సహకరిస్తున్నట్లు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా మండలంలోని రెవిన్యూ
సిబ్బంది అక్రమ రైస్ తరలిస్తున్న వారిని పట్టుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు
Post A Comment: