*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
*ఆసుపత్రి అభివృద్ధికి విరాళంగా చెక్కు అందజేత
మన్యం మనగడ, పినపాక:
ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక దేవాలయాలు అని వైద్యులు మనకు కనిపించే దేవుళ్లు అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం పినపాక మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి వికాస్ ఆగ్రి ఫౌండేషన్ నుండి రూపాయలు 5000 విరాళంగా పి హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ టి వెంకటేశ్వర్లు కు బ్యాంక్ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు కరోనా మహమ్మారి లాంటి కష్టకాలంలో జానంపేట వైద్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలు మరువలేనివన్నారు ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి ఆరోగ్య ఘని గా పేరు తెచ్చుకుందన్నారు..డాక్టర్ల సూచన మేరకు త్వరలోనే జానంపేట ఆసుపత్రిలో రోగులకు సౌకర్యం కోసం అవసరమైన ఫర్నిచర్ ని అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సహకరించినందుకు జానంపేట పి.హెచ్.సి వైద్య సిబ్బంది బృందం సాంబ శివ రెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ టి వెంకటేశ్వర్లు స్టాఫ్ నర్స్ ఏ విజయ రాణి ఫార్మాసిస్ట్ బి రవీంద్రబాబు హెల్త్ అసిస్టెంట్ బి నాగమల్లేశ్వరరావు ఏఎన్ఎంలు కె వెంకటలక్ష్మి పి.భూలక్ష్మి తదితరులు పాల్గొన్నా
Post A Comment: