గుండాల అక్టోబర్ 21 (పన్యం మనుగడ) ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి సభను తుడుందెబ్బ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించింది. అనంతరం తుడుం దెబ్బ జిల్లా నాయకులు వజ్ర ఎర్రయ్య , న్యూ డెమోక్రసీ నాయకులు ముక్తి సత్యం మాట్లాడుతూ కొమరం భీమ్ ఆశయ సాధన కోసం ఈ ప్రతి ఒక్కరు నడుం బిగించి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గిరిజనుల కోసం కొమరం భీమ్ అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ప్రధాన కోడెం వెంకటేశ్వర్లు, గుండాల సర్పంచ్ సీతారాములు, పునేం శ్రీను, మోకాళ్ళ కన్నయ్య , గోవింద నరసింహారావు , న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న , పీ వై ఎల్ నాయకులు రవి, సిపిఐ నాయకులు రమేష్ , తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: