మన్యం టివి ,దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామపంచాయతీ సీతానగరం గ్రామంలో ఐటిసి బంధన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ వరలక్ష్మి చేతుల మీదుగా పేదరికం గా ఒంటరి మహిళలు జీవనం సాగిస్తున్న మహిళలకు బంధన్ సంస్థ వారు 44 మంది మహిళలుకు సుమారుగా 50.0000లక్షల రూపాయలు సరుకులు రెడీమేడ్ దుస్తులు ఫ్యాన్సీ వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఏ వ్యాపారం ఇష్టమో వాటికి సంబంధించిన మెటీరియల్ను సర్పంచ్ చేతుల మీదుగా బంధన్ సంస్థ వారు ఒంటరి మహిళలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఒంటరి మహిళలు తమస్వచ్చంద తరుపున హార్దిక సహాయం ఇవ్వడం ఎంతో శుభపరిణామం అని వారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది స్థానిక మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: