గుండాల అక్టోబర్ 2( మన్యం మనుగడ) మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు ,అధికారులు ప్రారంభించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. హాజరైన మహిళలకు ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు వారికి అందజేశారు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చేనేత చీరలను మహిళలకు అందజేస్తున్నారు. పండుగకు నాలుగు రోజుల ముందు నే చీరలను రెవిన్యూ శాఖ ద్వారా పంపిణీ చేపడుతున్నారు. ఈసారి 5817 చీరల గాను 3780చీరలు రావడంతో అందరికీ సరిపోవని ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, అభ్యంతరం తెలపడంతో స్పందించిన తాసిల్దార్ రంగు రమేష్ ఉన్నత అధికారులకు చరవాణి లో సమాచారం అందించడంతో స్పందించిన అధికారులు మిగతా చీరలను కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల మహిళలు చీరలను తీసుకున్నారు. మళ్లీ ఇలాంటి సమస్య తలెత్తకుండా చూస్తానని తాసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, ఎంపీడీవో బాలమణి, తాసిల్దార్ రంగు రమేష్, ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, ఆర్ఐ నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ వట్టం సురేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: