మన్యం టివి, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లోని అడవి రామరం గ్రామం చెందిన గిరిజన విద్యార్థులు ములకపడు ప్రభుత్వాసుపత్రికి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కొరకు గత మూడు వారాల నుంచి తిప్పించుకొని సర్టిఫికెట్ కొరకు అడిగితే గిరిజన బిడ్డలను అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. విద్యార్థులకు దమ్మపేట మండలం గుండ్లపల్లి లో ఆరో తరగతి చదువు పై ఏకలవ్య పాఠశాలలో సీటు వచ్చిందని ఫిజికల్ సర్టిఫికెట్ కొరకు వెళ్తే ఇలాంటి పరిస్థితి మరో విద్యార్థులకు మండల గిరిజన బిడ్డలకు జరగకూడదని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. సంబంధిత విషయమై ఈరోజు ఐటీడీఏ పీవో భద్రాచలం వారికి దృష్టికి తీసుకువెళ్లారు ఇట్టి విషయమై విచారణ చేపించి తగు చర్య తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. విద్యార్థులు సున్నం కళ్యాణ్ బాబు ఉ వినోద్ మహేంద్ర ,ప్రాణేశ్వరి పాల్గొన్నారు.
Post A Comment: