చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ కె ఉమర్ డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...... నరేంద్ర మోడీ ప్రభుత్వం తరచూ నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు. సామాన్య మధ్యతరగతి కూలీలు రోజు రోజుకి దిగజారి దానికి కారణం కేంద్రం అవలంబిస్తున్న విధానాలేనన్నారు. కేంద్రం పెంచిన ధరలు తగ్గించకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ నాయకులు వెంకట్రావు, భీముడు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: